స్కూల్‍లో మీటింగ్‌కు రాని తల్లి.. ఇంటికి వెళ్లి చూసేసరికి షాక్.. బుడ్డోడే కానీ భలే స్మార్ట్!

5 months ago 10
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ బాలుడు సమయస్పూర్తితో వ్యవహరించి తల్లికి పునర్జన్మ ఇచ్చాడు. కళ్లముందే కరెంట్ షాక్‌తో కొట్టుమిట్టాడుతున్న తల్లిని చూసి భయపడకుండా ధైర్యంగా కాపాడాడు. భీమవరం మండలం జొన్నలగరువులో ఈ ఘటన జరిగింది. ఐదో తరగతి చదువుతున్న దీక్షిత్.. తల్లి స్కూల్‌లో జరిగిన సమావేశానికి రాకపోవటంతో ఇంటికి వెళ్లాడు. అప్పుడే తల్లికి కరెంట్ షాక్ కొట్టిన సంగతి గమనించాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించి మోటార్ స్విచ్ ఆఫ్ చేయటంతో పాటుగా.. తల్లి మీద పడిన వైర్ తొలగించి ఆమెను కాపాడాడు.
Read Entire Article