సోషల్ మీడియాపై నిఘా పెట్టేందుకు హైదరాబాద్ పోలీసుల చేతికి సరికొత్త అస్త్రం దొరికింది. ఏఐ సాయంతో నెట్టింట ఫేక్ ప్రచారాలు చేసేవారు, సంఘ విద్రోహ శక్తులపై ఎప్పటికప్పుడు డేగ కన్ను పెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 'సాక్ ఐ' పేరుతో ఏఐ యాప్ను ప్రారంభించారు. తాజాగా ఈ సాక్ ఐ యాప్.. దానికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీసులు.. వెల్లడించారు. ఈ సాక్ ఐతో నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని సీపీ సజ్జనార్ వెల్లడించారు.