Chandrababu And Pawan Kalyan Reduced Vehicles In Convoy: ప్రధాని నరేంద్రమోదీ ఇంధన పొదుపుపై పిలుపునివ్వడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్లో ఉండే వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని సూచించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్కు కీలక సూచనలు చేశారు. అలాగే మంత్రులు, ఇతర వీఐపీలు కూడా కాన్వాయ్లో సాధ్యమైనంత తక్కువ వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన కాన్వాయ్లో వాహనాలను తగ్గించాలని సూచించారు.