ఏపీ సీఎం చంద్రబాబు నాయుణ్ని తాను కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని.. ఈ సందర్భంగా తాను ఎలాంటి పదవులు అడగలేదని జనసేన నేత బాలినేని శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ మావిగన్ ప్రతిపాదనపై స్పందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే తాను మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ వద్ద రాజధానిని ఏర్పాటు చేద్దామని జగన్కు చెప్పానన్నారు. అయితే అప్పుడు జగన్ విశాఖవైపు మొగ్గు చూపారని చెప్పారు.