ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో అనుమాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. తొలుత ఆయన గుండెపోటుతో మరణించినట్లు భావించినప్పటికీ, మృతదేహంపై గాయాలున్నాయని ఆయన భార్య వసంత ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ దుండిగల్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వ్యాపార పనుల నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఆయన.. తిరిగి వస్తూ కలికిరిలో కుప్పకూలి మరణించారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.