ఎన్టీఆర్ జిల్లా ఎ కొండూరు మండలంలోని కిడ్నీ బాధిత గ్రామాలకు స్వచ్ఛమైన కృష్ణా జలాలను అందించే ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. సుమారు 15 తండాల్లోని 57 వేల మంది జనాభాకు ప్రతిరోజూ 22 లక్షల లీటర్ల నీటిని అందించేలా కుదప సంపు నుంచి పైప్లైన్ నిర్మించారు. గత పదేళ్లుగా కిడ్నీ వ్యాధులతో వందలాది మంది మరణించిన ఈ ప్రాంతంలో.. సురక్షిత నీటి సరఫరా ద్వారా వ్యాధులను అరికట్టడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా.. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు.