సిడ్నీలోని బోండి బీచ్‌లో కాల్పుల ఘటన.. నిందితుడిది హైదరాబాదే.. డీజీపీ సంచలన ప్రకటన

5 months ago 12
ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడు సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ధృవీకరించారు. 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్, అక్కడే స్థిరపడి ఐసిస్ (ISIS) వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెంచుకున్నాడు. సిడ్నీలో యూదుల హనుక్కా వేడుకలపై జరిపిన కాల్పుల్లో 16 మంది మరణించగా.. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సాజిద్ హతమయ్యాడు. మూడు దశాబ్దాలుగా విదేశాల్లో ఉన్నా ఇతడు భారత పాస్‌పోర్టునే వినియోగిస్తున్నాడు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఇతనిపై ఎలాంటి నేర చరిత్ర లేదని.. చివరిగా 2022లో నగరాన్ని సందర్శించాడని పోలీసులు వెల్లడించారు.
Read Entire Article