సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్.. త్రీ లెవల్ విధానం తేవాలన్న సీఎం రేవంత్ రెడ్డి

2 months ago 16
హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ రహిత సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం త్రీ లెవల్ విధానాన్ని అనుసరించనున్నట్లు తెలిపారు. సచివాలయం వేదికగా గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలపై పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. పలు కీలక విషయాలను వెల్లడించారు. రోడ్ల విస్తరణతోనే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించదని.. దాని కోసం మల్టీ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ అవసరమని అభిప్రాయపడ్డారు.
Read Entire Article