హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ రహిత సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం త్రీ లెవల్ విధానాన్ని అనుసరించనున్నట్లు తెలిపారు. సచివాలయం వేదికగా గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలపై పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. పలు కీలక విషయాలను వెల్లడించారు. రోడ్ల విస్తరణతోనే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించదని.. దాని కోసం మల్టీ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ అవసరమని అభిప్రాయపడ్డారు.