చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా కుప్పం, పలమనేరు ప్రాంతాల నుంచి మేలైన మామిడి పండ్లను సేకరించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తాజాగా తోతాపురి, బంగినపల్లి మామిడి పండ్ల రకాలను సింగపూర్కు ఎగుమతి చేశారు. మంచి మామిడి పండ్లను సేకరించి కర్ణాటక పరిధిలోని చింతామణి ప్యాక్ హౌస్లో ఉంచి ఇప్పుడు వాటన్నింటిని ఒక కంటైనర్ ద్వారా నౌకలో సింగపూర్కి పంపుతున్నారు. 12 రోజుల తర్వాత ఆ నౌక సింగపూర్కి చేరుకోనుందని రైతులు చెబుతున్నారు.