సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాధవీలతపై కేసు నమోదు..

6 months ago 20
ప్రముఖ నటి మాధవీలతపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. షిరిడీ సాయిబాబా దేవుడు కాదంటూ ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయనే ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. మాధవీలతతో పాటు ఈ వివాదాస్పద ప్రచారంలో పాల్గొన్న పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని వీరికి నోటీసులు జారీ అయ్యాయి. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేయడం లేదా ఇతరుల నమ్మకాలను కించపరచడం వంటి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
Read Entire Article