సాధారణ ప్రయాణికుడిలా.. టికెట్ తీసుకొని ఆర్టీసీ బస్సెక్కిన సజ్జనార్.. కారణం ఇదే..

8 months ago 13
తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీల నేపథ్యంలో.. టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ఎండీగా వీసీ సజ్జనార్ తన చివరి రోజున ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆయనకు హైదరాబాద్ నగర సీపీగా పోస్టింగ్ దక్కింది. ప్రజా రవాణాపై తమకున్న అనుబంధాన్ని చూపుతూ.. సజ్జనార్ సాధారణ ప్రయాణికుడి మాదిరిగా టెలిఫోన్ భవన్ నుంచి బస్ భవన్ వరకు 113I/M రూట్ బస్సులో ప్రయాణించారు. ఆయన యూపీఐ ద్వారా టికెట్ కొని.. ప్రయాణికులతో మాట్లాడారు. ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలు పొందుతున్న ప్రయోజనాల గురించి ఆరా తీశారు.
Read Entire Article