సరస్వతి దేవిగా దుర్గమ్మ.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

9 months ago 21
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసర నవరాత్రులు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఎనిమిదో రోజు, అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా చదువుల తల్లి సరస్వతి దేవి అలంకరణలో భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తున్నారు.అటు, కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించారు. దసరా శరన్నవరాత్రుల్లో ప్రభుత్వం తరఫున మూలా నక్షత్రం రోజు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆలయానికి సీఎం దంపతులకు మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకుని, వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందుకున్నారు. .
Read Entire Article