టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. గతేడాది డిసెంబర్ 4వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రమోషన్ల సందర్భంగా జరిగిన ఘోర తొక్కిసలాట కేసులో ఆయనకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వచ్చే సోమవారం నాడు అల్లు అర్జున్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఆపూర్తి వివరాలు మీకోసం.