సంతూర్ సబ్బుల లోడ్‌తో వెళ్తోన్న లారీకి యాక్సిడెంట్.. నిమిషాల వ్యవధిలో సబ్బులు మాయం..

11 months ago 17
మంచిర్యాల జిల్లాలో మానవత్వం మంటగలిసిన ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. లక్సెట్టిపేట వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక ప్రాణం గాలిలో కలిసిపోయింది. తీవ్ర గాయాలతో మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే, అక్కడి జనం మాత్రం సహాయం అందించాల్సింది పోయి స్వార్థం ప్రదర్శించారు. ప్రమాదానికి గురైన వాహనంలోని సబ్బు పెట్టెలను ఎత్తుకెళ్లేందుకు పోటీపడ్డారు. నెత్తుటి మరకల సాక్షిగా కొందరు చూపిన ఈ ప్రవర్తన సమాజ నైతిక పతనాన్ని కళ్లకు కట్టింది.
Read Entire Article