స‌న్మానం తీరు మారింది.. ర‌హ‌దారిని సాధించిన వారిని అభినందించిన హైడ్రా క‌మిష‌న‌ర్..

4 months ago 15
మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీలోని డాలర్ మెడోస్ కాలనీ నివాసితులు పౌర చైతన్యానికి నిదర్శనంగా నిలిచారు. తమ లేఅవుట్ రహదారిని ఆక్రమించి ప్రహరీ నిర్మించిన వ్యక్తిపై వారు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో ఆ ఆక్రమణలను తొలగించి, రోడ్డును పునరుద్ధరించారు. ఇందుకు కృతజ్ఞతగా కమిషనర్‌ను సన్మానించేందుకు వెళ్లిన కాలనీవాసులకు అనూహ్య గౌరవం లభించింది. తనను సన్మానించడం కంటే.. అక్రమాలపై పోరాడిన ప్రజలనే గౌరవించాలని భావించిన రంగనాథ్ వారిని శాలువాలతో సత్కరించారు.
Read Entire Article