షాబాద్ ఆరు హత్యల కేసుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్రంగా స్పందించారు. రాజ్కుమార్ ఆత్మహత్యతో కేసు ముగిసిపోలేదని.. పోక్సో కేసులో అతడు బెయిల్పై బయటకు రావడంలో పోలీసుల పాత్రపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్లక్ష్యం లేదా అవినీతి కారణంగానే ఈ దారుణం జరిగిందనే ఆరోపణలు మహిళల్లో ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంటూ.. మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు.