రాష్ట్రంలో పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో పోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి.. బెయిల్ మీద వచ్చి, బాధితురాలి కుటుంబసభ్యులను, సొంత కుటుంబాన్ని కడతేర్చిన ఘటనను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పోక్సో చట్టం అమలులో తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని సూచనలు చేశారు.