షాబాద్లో 6 హత్యలు చేసి సంచలనం సృష్టించిన నిందితుడు రాజ్కుమార్ మృతిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి సెల్ఫీ వీడియో, మొబైల్ ఫోన్లో లభించిన వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. హత్యల తర్వాత పరారైన రాజ్కుమార్ రెండు రోజుల అనంతరం పెంజర్ల సమీపంలో మృతదేహంగా కనిపించాడు. పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు.. ఫోరెన్సిక్ నివేదికలు, వీడియో, లేఖ ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.