శ్రీశైలంలో చిరుత కలకలం.. అర్ధరాత్రి పూజారి ఇంట్లోకి!

1 year ago 22
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం రేపింది. పాతాళగంగ సమీపంలోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించింది. ఆ ఇంటి పరిసరాల్లో చిరుత సంచరిస్తోన్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో భక్తులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల చిరుతలు జనావాసాల్లోకి వచ్చిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కృష్ణా, అనంతరపురం జిల్లాల ప్రజలకు అడవి జంతువులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గన్నవరం మండలం మెట్లపల్లి శివారులో ఆదివారం ఉదయం చిరుతపులి సంచారం చుట్టుపక్కలవారిని హడలెత్తించింది. మెట్లపల్లి సమీపంలోని ఆయిల్ పామ్ తోట వద్ద చిరుత సంచరించినట్లు ఆర్టీసీ బస్ కండక్టర్ గుర్తించాడు.
Read Entire Article