శ్రీశైలంలో అగ్నిప్రమాదం.. భక్తులకు తప్పిన ముప్పు..

3 months ago 19
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో అగ్నిప్రమాదం జరిగింది. వీఐపీ కాటేజీలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తులో ఏసీ పేలటంతో మంటలు ఎగసిపడ్డాయి. పెద్దఎత్తున పొగ వ్యాపించింది. దీంతో భక్తులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. దీనిపై ఆలయ సిబ్బంది విచారిస్తున్నారు.
Read Entire Article