శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

11 months ago 19
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు జలహారతి నిర్వహించేందుకు శ్రీశైలం చేరుకున్నారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో చేరుకున్న ఆయన, భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. ఎగువ రాష్ట్రాల నుంచి వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉంది. జలాశయం నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జలహారతి కార్యక్రమం అనంతరం అధికారులు ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్లు విడుదల చేయనున్నారు.
Read Entire Article