తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంతో టీటీడీ ముందుంది. ఇందులో భాగంగా సామాన్యులు ఎక్కువ సమయం నిరీక్షించకుండా ఉండేలా వీఐపీ బ్రేక్ దర్శనాలను తగ్గించింది. అలాగే, శ్రీవాణి ట్రస్ట్కు రూ.10,000 విరాళం ఇచ్చే భక్తులకు దర్శన టిక్కెట్ల కేటాయింపులో తాజాగా మార్పులు చేసింది. ఇకపై వీటిని మూడు నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేలా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తాజాగా టీటీడీ ప్రకటన చేసింది.