Srikalahasti Ambulance Accident Four Killed: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దగ్గర ఓరందూరు హైవేపై ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఇద్దరికి గాయాలు అయ్యాయి.. వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఓ రోగిని కోల్కతా నుంచి బెంగళూరుకు అంబులెన్స్లో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్సలో మొత్తం ఆరుగురు ఉన్నట్లు చెబుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు.