శ్రీకాళహస్తి ఆలయంలో 200మంది రష్యన్ భక్తులు

3 months ago 21
భారతీయ ఆధ్యాత్మికతకు భాషా, ప్రాంత బేధం లేదని మరోసారి నిరూపితమైంది. పంచభూత లింగాలలో ఒకటైన శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడానికి ఏకంగా జర్మనీ, రష్యా దేశాల నుంచి 200 మంది భక్తులు తరలివచ్చారు. ఆలయంలోని అద్భుత శిల్పకళను చూసి వారు విస్తుపోయారు. గంటల తరబడి ధ్యానం చేశారు. దక్షిణ కైలాసంగా పిలవబడే ఈ ఆలయ విశిష్టతను తెలుసుకుని వారు ఆశ్చర్యపోయారు. ఆలయ ప్రాంగణంలో నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేస్తూ భారతీయ సనాతన ధర్మం పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు.
Read Entire Article