వైసీపీ మాజీ ఎమ్మెల్యే, శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్పర్సన్ జొన్నలగడ్డ పద్మావతి భారత సైన్యానికి రూ.10 లక్షల విరాళం అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆపరేషన్ సిందూర్లో సైన్యం చేసిన సాహసానికి గుర్తుగా ఆమె ఈ విరాళం ప్రకటించారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఇండియన్ ఆర్మీకి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.