వైకుంఠద్వార దర్శనానికి తిరుమల వెళ్తున్నారా? అయితే ఈ రూల్స్ మీకోసమే

1 year ago 27
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఉత్తర ద్వార దర్శనాలపై టీటీడీ ఈవో జే శ్యామలరావు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు కీలక సూచనలు చేశారు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి రోజు వేకువజామున 4:30 ప్రోటోకాల్.. 8 గంటలకు సర్వ దర్శనం ప్రారంభమవుతందని ఆయన తెలిపారు. జనవరి 10న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తారన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు వాహన మండపంలో స్వామివారు దర్శనమిస్తారని.. జనవరి 11 ఉదయం ఇంద్రపుష్కరిణిలో శ్రీవారికి చక్రస్నానం నిర్వహిస్తారన్నారు. తిరుపతి, తిరుమలలో 94 కౌంటర్ల ద్వారా టైం స్లాట్ టోకెన్స్ జారీ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జనవరి 9వ తేదీ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశికి సంబంధించి 1 లక్ష 20 వేల టికెట్స్ జారీ చేస్తామన్నారు.
Read Entire Article