Amaravati Farmers meet YS Jagan At Tadepalli: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతి ప్రాంతంలోని కొంతమంది రైతులు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో జగన్కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన అమరావతి రైతులు.. ఇప్పుడు ఆయనతో భేటీ కావటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు రైతులకు అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.