వేసవిలో తిరుపతికి వెళ్తున్నారా.. దక్షిణ మధ్య రైల్వే సూపర్ న్యూస్..

1 year ago 26
వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. తిరుపతి నుంచి మచిలీపట్నం మధ్య 14 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 13 నుంచి మే 25 వరకు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి రైలు బయలుదేరుతుంది. అలాగే మచిలీపట్నం నుంచి ఏప్రిల్ 14 నుంచి మే 26 వరకు ప్రతి సోమవారం రైలు తిరుపతికి బయలుదేరుతుంది. ఈ రైళ్లు పలు స్టేషన్లలో ఆగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
Read Entire Article