కృష్ణా నదిలో పడవ బోల్తా పడి ముగ్గురు చనిపోయిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొంతమంది వేడుకకు హాజరై పడవలో తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ పడవ బోల్తాపడింది. దీంతో పది మంది నదిలో పడిపోయారు. స్థానికులు గమనించి ఆరుగురిని రక్షించారు. నలుగురు గల్లంతు కాగా ఇప్పటివరకూ మూడు మృతదేహాలను గుర్తించారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.