వీధి కుక్కలను ఎంత ఘోరం చంపారో తెలుసా.. ఏకంగా 120 కుక్కలను ఇలా..

4 months ago 16
హనుమకొండ జిల్లాలో వీధికుక్కల బెడదను తొలగిస్తామన్న హామీ ఇద్దరు సర్పంచ్‌లను చిక్కుల్లో పడేసింది. శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో 120కి పైగా కుక్కలను అమానుషంగా చంపి పాతిపెట్టిన ఘటన సంచలనం సృష్టించింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కుక్కకాటు సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్‌లు విష ప్రయోగం ద్వారా మూగజీవాలను హతమార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జంతు ప్రేమికుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా, భూమిలో పాతిపెట్టిన కళేబరాలు బయటపడ్డాయి. జంతు హింస నిరోధక చట్టం కింద ఇద్దరు సర్పంచ్‌లతో పాటు తొమ్మిది మందిపై కేసు నమోదైంది. కుక్కల బెడద నుంచి విముక్తి లభించినా, ఈ కిరాతక చర్య ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article