విశాఖ నగరాన్ని రాబోయే 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర సెమీ రింగురోడ్డు నిర్మించనున్నారు. భోగాపురం విమానాశ్రయానికి ఏడు కనెక్టింగ్ రోడ్లు, బీచ్ కారిడార్తో పాటు రూ.14 వేల కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఉత్తరాంధ్రను ప్రత్యేక అభివృద్ధి జోన్గా మారుస్తూ ఆర్థిక కారిడార్ను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది.