సాగరతీరం విశాఖపట్నం రూపురేఖలు మార్చేలా ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే కైలాసగిరి నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకూ బేసిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. విశాఖ ఎకనమిక్ రీజియన్పై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. బేసిటీగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బీచ్ వాటర్ స్పోర్ట్స్, కైలాసగిరి, వైజాగ్ జూ, ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేయాలని సూచించారు.