తెలంగాణలో పాఠ్యపుస్తకాల ధరలు భారీగా తగ్గాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గనుంది. ఒక్కో పుస్తకంపైన 15 శాతం నుంచి 20 శాతం వరకు ధరలు తగ్గాయి. గతంలో పేజీ ధర 54 పైసలు ఉండగా.. ప్రస్తుతం అది 44.50 పైసలకు తగ్గింది. దీంతో పుస్తకాల ధరలు తగ్గాయి. అయితే పుస్తకాల ముద్రణ టెండర్లలో.. పలు సంస్థలు తక్కువ ధరకు కోట్ చేయడంతో.. రేట్లు తగ్గాయి. పదో తరగతి పుస్తకాలన్నీ కలిపి రూ.178 తగ్గడం గమనార్హం.