విద్యార్థులకు అలర్ట్.. ఈనెల 30న, జులై 2న కాలేజీలు బంద్.. కారణం ఇదే..

3 weeks ago 4
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రద్దు చేసే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. నిలిచిపోయిన రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా తరగతుల బహిష్కరణ, కళాశాలల బంద్, కలెక్టరేట్ల ముట్టడి, రాస్తారోకోలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా జులై 2న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌ నిర్వహిస్తామని, జులై 15న భారీ విద్యార్థి మార్చ్‌ చేపడుతామని బీసీ ఐకాస ఛైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ప్రకటించారు.
Read Entire Article