తమిళనాడు సీఎం విజయ్ మద్యం దుకాణాలపై సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, పాఠశాలల సమీపంలోని మద్యం దుకాణాలను రెండు వారాల్లో మూసివేయాలంటూ విజయ్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై హర్షం వ్యక్తమవుతోంది. అయితే తన నియోజకవర్గంలోని గుడి, గురుకులం దగ్గర్లోని బార్ను మూసేయమంటే.. నెలకు లక్షన్నర ఇస్తామని బేరాలు మొదలెట్టారంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెట్టిన వాట్సాప్ స్టేటస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో తమిళనాడు తరహాలో ఏపీలోనూ ఫాలో కావాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.