ఎవరీ విష్ణు రెడ్డి.. సోషల్ మీడియాలో ఈ వ్యక్తిపై ఇటీవల విపరీతంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించాలంటూ టీవీకే అధినేత విజయ్.. గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను కలిసిన సమయంలో విష్ణు రెడ్డి అక్కడే ఉన్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. ఎవరీ విష్ణు రెడ్డి అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఈయన ఏపీకి చెందినవారని.. ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి సమీప బంధువు అవుతారని.. బావమరిది అవుతారంటూ వార్తలు వస్తున్నాయి.