విజయవాడలోని ఎయిర్ పోర్టు మూసివేసేందుకు రంగం సిద్ధమైందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. అవన్నీ అవాస్తవాలని. నమ్మవద్దని ప్రజలను కోరింది. అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అనేది వ్యూహాత్మక ప్రాజెక్టు అని.. ఇది అందుబాటులోకి వచ్చినప్పటికీ, గన్నవరం విమానాశ్రయం యధావిధిగా సేవలు అందిస్తుందని స్పష్టం చేసింది. ఈ విషయంలో అవాస్తవాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.