విజయవాడ లోకో పైలెట్ హత్య కేసులో సంచలన విషయాలు.. అదే రోజు మరో ముగ్గురు కూడా.. సీసీ ఫుటేజ్‌లో!

1 year ago 24
Vijayawada Loco Pilot Murder Case: విజయవాడ రైల్వేట్రాక్‌పై విధి నిర్వహణలో ఉన్న లోకో పైలెట్‌ను గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఏబేలు లోకో పైలెట్‌.. గూడ్స్‌ రైలుకు మరో ఇంజన్‌ను తీసుకురావడానికి (షంటింగ్‌) పాత ఎఫ్‌ క్యాబిన్‌ వద్దకు వెళ్తుండగా.. నైజాంగేటు వద్ద గుర్తుతెలియని యువకుడు ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న మరో లోకో పైలెట్‌ ఆయన్ను రైల్వే ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతుండగా చనిపోయారు. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Read Entire Article