విచారణకు రండి.. అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు.. మంగళవారం ఏం జరగనుంది?

1 year ago 24
సినీ హీరో అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో విచారణకు రావాల్సిందిగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు పంపారు. రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
Read Entire Article