వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు.. ఓ వైపు వర్షం, మరోవైపు భూకంపం

11 months ago 20
వికారాబాద్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో పరిగి మండలం భాషిరెడ్డిపల్లి సహా పలు గ్రామాల్లో కొన్ని సెకన్ల పాటు భూప్రకంపనలు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. భారీ వర్షం కురుస్తున్న సమయంలో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, దీని తీవ్రత, ఇతర వివరాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.
Read Entire Article