వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్లలో రాత్రి పూట రాకపోకలు బంద్..

7 months ago 18
ఏపీలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలోకి బోల్తాపడింది. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీ ప్రాంతాలలో పొగమంచు కురిసే వేళల్లో ఘాట్ రోడ్లలో బస్సులు. ఇతర వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు.
Read Entire Article