వాట్సాప్ స్క్రీన్ షేర్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్త.. తెలంగాణ పోలీసుల హెచ్చరిక..

9 months ago 17
రోజురోజుకు సైబర్ నేరాలు ఆందోళన కలిగించే స్థాయిలో పెరుగుతున్నాయి. అమాయకులను వలలో వేసుకొని లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. పోలీసులు తరచూ హెచ్చరిస్తున్నా.. ఎక్కడో ఒకచోట ఇలాంటి మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఆన్‌లైన్ మోసగాళ్ల బారిన పడే అవకాశం ఉంది. దీనిపై సోషల్ మీడియా ద్వారా పోలీసులు జాగ్రత్తలు సూచించారు. ముఖ్యంగా వాట్సాప్ స్క్రీనింగ్‌ను ఎవరికీ పంచుకోవద్దని స్పష్టంగా హెచ్చరించారు. ఇలా చేస్తే అకౌంట్ పూర్తిగా ఖాళీ కావచ్చని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Entire Article