వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు.. రేపు విడుదలయ్యే ఛాన్స్!

11 months ago 17
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఊరట లభించింది. నూజివీడు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదివరకే అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో వంశీ బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు మట్టి అక్రమ తవ్వకాల కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై బుధవారం విచారణ జరిగే అవకాశం ఉంది.
Read Entire Article