వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలో రాజేశ్ నాయక్ అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబంలో ఆస్తి పంపకాల విషయమై భార్య, తల్లిదండ్రుల మధ్య జరుగుతున్న గొడవలతో మనస్తాపం చెందిన ఆయన.. జులై 5న రాత్రి రైలు పట్టాలపై నిలబడి భార్యకు వీడియో కాల్ చేసి లైవ్లో వస్తున్న రైలును చూపిస్తూ ప్రాణాలు తీసుకున్నాడు. భార్య దీనిని బెదిరింపుగా భావించి తేలిగ్గా తీసుకోగా.. సోమవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.