లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎస్సార్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో అత్తాపూర్ పీఎస్లో ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. రూమ్లోకి లాక్కెళ్లి.. కత్తితో బెదిరించి ప్రైవేటు వీడియోలు భర్తకు పంపి వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ సాధించి స్ఫూర్తిగా నిలిచిన ఉదయ్ కృష్ణారెడ్డి.. వేధింపుల కేసుతో అబాసుపాలై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.