లక్ష్మీ ఆరోపణలు.. కిరణ్ రాయల్ రియాక్షన్

1 year ago 30
లక్ష్మీ అనే మహిళ చేసిన ఆరోపణలకు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ స్పందించారు. వైసీపీ దొంగల ముఠా తనపై కక్ష కట్టిందని.. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. క్రిమినల్ కిలాడీ లేడీ లక్ష్మీతో తనపై నిరాధారణమైన ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆమె తనకు రూ.1.20 కోట్లు ఇచ్చినట్లు ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. 2016లో రూ.50 లక్షల చీటీలు వేశామని.. వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎప్పుడో ముగిశాయని వెల్లడించారు. అప్పుల బాధతో మనస్తాపం చెంది లక్ష్మీ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిపారు. లక్ష్మీపై గతంలో 6 కేసులున్నాయని అన్నారు. భూమన అభినయరెడ్డి లక్ష్మీని రెచ్చగొట్టి తనపై ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు.
Read Entire Article