ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో భారీ గోల్డ్ స్కామ్ వెలుగుచూసింది. కేవలం లక్ష రూపాయలకే తులం బిస్కెట్ బంగారం ఇస్తామంటూ నమ్మించిన కేటుగాళ్లు.. అమాయక ప్రజల నుండి రూ. 47.40 లక్షలు వసూలు చేసి పరారయ్యారు. నకిలీ ముఠా మాయమాటలు నమ్మి మోసపోయామని గ్రహించిన బాధితుడు బానోతు అఖిల్ కామేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో శుక్రవారం ఇద్దరు నిందితులపై కేసు నమోదైంది.