Vijayawada Goods Trains Bypass Railway Line: విజయవాడకు సమీపంలో రైళ్ల రాకపోకల కోసం కొత్తగా బైపాస్ లైన్ ప్లాన్ చేశారు. విశాఖట్పం టు చెన్నై మధ్య గూడ్స్ రైళ్ల కోసం బైపాస్ లైన్ ప్రతిపాదించారు. ఇందుపల్లి నుంచి దుగ్గిరాల మధ్య 37 కిలోమీటర్ల మేర నిర్మాణానికి రైల్వే బోర్డుకు డీపీఆర్ పంపించారు. గుడివాడ మీదుగా విశాఖపట్నం- చెన్నై వచ్చిపోయే గూడ్స్ రైళ్లకు వెసులుబాటు కల్పించారు. ఈ బైపాస్ లైన్ ద్వారా రైళ్లు విజయవాడకు రాకుండానే రాకపోకలు కొనసాగించేలా ప్లాన్ చేశారు.