రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. త్వరలోనే అకౌంట్లలోకి డబ్బులు

1 year ago 31
తెలంగాణలో రైతులకు రేవంత్ సర్కార్‌ తీపి కబురు అందించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 4 ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు పంట పెట్టుబడి సాయం అందింది. ఇప్పుడు 4 ఎకరాలకుపైన భూమి కలిగిన రైతులకు కూడా పూర్తిస్థాయిలో పెట్టుబడి సాయం విడుదల చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నిధుల సర్దుబాటు పూర్తైన వెంటనే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసి రైతుల ఖాతాల్లో సాయం జమ చేసే అవకాశం ఉంది.
Read Entire Article