రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2026 ఏప్రిల్ నెలకు సంబంధించి టన్ను గెలల ధరను రికార్డు స్థాయిలో రూ.23,656గా ఖరారు చేస్తూ ఉద్యానశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత దశాబ్ద కాలంలోనే ఇది అత్యధిక ధర కావడంతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా.. గత రెండేళ్లలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, రాష్ట్ర చరిత్రలోనే గరిష్ట సాగు దిశగా అడుగులు వేస్తున్నామని ఉద్యానశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.